భారతదేశం, మే 13 -- Monsoon 2026 arrival in India : వేసవి తాపంతో అల్లాడుతున్న భారతీయులకు ఊరటనిచ్చే వార్త. 2026 నైరుతి రుతుపవనాల ప్రస్థానం ప్రారంభం కానుంది. ఈ వారాంతం నాటికి దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని భాగాలు, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల మీదుగా రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కీలక ప్రకటన చేసింది.

ఐఎండీ ప్రకారం.. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. రాబోయే 48 గంటల్లో ఇది మరింత బలపడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రుతుపవనాల రాకకు మార్గం సుగమం అవుతుందని వాతావరణ నిపుణులు పేర్కొన్నారు.

అయితే, కేరళను రుతుపవనాలు ఎప్పుడు తాకుతాయనే దానిపై ఐఎండీ ఇప్పుడే స్పష్టత ఇవ్వలేకపోతోంది.

"కే...