భారతదేశం, ఏప్రిల్ 7 -- 2026 వర్షాకాలంపై తన తాజా నివేదికను విడుదల చేసింది ప్రైవేట్ వాతావరణ అంచనా సంస్థ 'స్కైమెట్'. ఈ ఏడాది దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాల ద్వారా అందే వర్షపాతం "సాధారణం కంటే తక్కువ"గా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. లాంగ్ పీరియడ్ యావరేజ్ (ఎల్​పీఏ) లో ఇది 94 శాతంగా ఉండవచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా జులై నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు క్రమంగా తగ్గుతాయని, ఇది వ్యవసాయ రంగంపై ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది.

గతేడాది (2025) భారత్ సాధారణం కంటే ఎక్కువ వర్షపాతాన్ని (7.9% అదనంగా) పొందింది. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గణాంకాల ప్రకారం.. వాయువ్య భారతం గత సీజన్‌లో 747.9 ఎంఎం వర్షపాతాన్ని నమోదు చేసింది. ఇది 2001 తర్వాత అత్యధికం కాగా, 1901 తర్వాత ఆరో అత్యధిక వర్షపాతం. అయితే, తూర్పు, ఈశాన్య భారతంలో మాత్రం 1901 తర్వాత రెండో అత్యల్ప వర్షపాతం నమో...