భారతదేశం, ఏప్రిల్ 1 -- భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ పేసర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన మహమ్మద్ షమీ.. టీమిండియా తరపున తన చివరి మ్యాచ్ ఆడేసినట్లేనా? గత 12 ఏళ్లుగా భారత బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా నిలిచిన షమీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తోంది. విరాట్ కోహ్లీ-రవిశాస్త్రి ద్వయం హయాంలో జట్టుకు వెన్నెముకగా మారిన షమీ.. మూడు వన్డే ప్రపంచకప్‌లలో భారత్ తరపున కీలక పాత్ర పోషించాడు.

ముఖ్యంగా 2019, 2023 ప్రపంచకప్‌లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత.. షమీ మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించలేదు. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నప్పటికీ, భారత జట్టులోకి తిరిగి రావడం కోసం అతడు చేస్తున్న పోరాటం ఫలించడం లేదు.

జట్టులోకి పునరాగమనం చేయడానికి ఇంకే...