భారతదేశం, సెప్టెంబర్ 10 -- Mirzapur The Movie: బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.197 కోట్ల గ్రాస్ రాబట్టి థియేటర్లలో రచ్చ లేపుతున్న 'మీర్జాపూర్: ది మూవీ'పై ప్రముఖ కాలమిస్ట్, నవలా రచయిత్రి శోభా డే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సినిమా అసలు తీయాల్సింది కాదని, థియేటర్‌లో తాను 15 నిమిషాల పాటు నిద్రపోయానని ఇన్‌స్టాగ్రామ్ రీల్‌లో చెప్పి షాక్ ఇచ్చారు.

సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ మీర్జాపూర్: ది మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు. దీంతో ఎన్నో అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన శోభా డే.. అక్కడ అరాచకమైన సీన్లు చూసి అసహనం వ్యక్తం చేశారు. టికెట్ కోసం రూ.900, భేల్ కోసం రూ.260 ఖర్చు చేసి 4 గంటల సమయం వేస్ట్ చేసుకున్నానని ఆవేదన చెందారు.

"ఈ మూవీ అసలు మైండ్ లేకుండా తీశారు. అసలు కథే లేదు, ఎక్కడికి పోతోందో అర్థం కాలేదు. నా వెనకాల కూర్చున్న...