భారతదేశం, మార్చి 7 -- ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకంలో పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పదేపదే చెబుతోంది. ఇప్పటికే విద్యార్థుల మధ్యాహ్న భోజన పథకంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టిపెడుతున్నారు. ఎలాంటి ఇబ్బందులూ లేకుండా పిల్లలు కడుపునిండా పౌష్టికాహారం తినేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే విద్యార్థులకు చికెన్ స్థానంలో చేపలు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు ఆలోచనలు చేస్తోంది. వారానికోసారి చికెన్ స్థానంలో ఫిష్ అందించాలని ప్రభుత్వం యోచిస్తోందని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై సమీక్ష సందర్భంగా ఈ కామెంట్స్ చేశారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు ప్రజల ముంగిటకు చేరేలా అధికారులు కృషి చేయాలని అన్నారు....