భారతదేశం, మే 22 -- అమెరికా-భారత్ వ్యూహాత్మక సంబంధాలలో భాగంగా యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో నాలుగు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం మే 23న భారతదేశానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన కోల్‌కతా, ఆగ్రా, జైపూర్​తో పాటు దేశ రాజధాని దిల్లీని సందర్శించనున్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్​ జైశంకర్, ఇతర ఉన్నతాధికారులతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఒక అమెరికా విదేశాంగ మంత్రి కోల్‌కతాలో పర్యటించడం ఇదే తొలిసారి. దీనికి ముందు 2012లో హిల్లరీ క్లింటన్ ఇక్కడ పర్యటించారు. అయితే, సాధారణంగా కీలక విదేశీ నేతల పర్యటనలు దిల్లీలో మొదలవుతాయి. కానీ ఈసారి మార్కో రూబియో కోల్​కతాలో పర్యటించనున్నారు. ఎందుకు? దీని వెనుక ఆసక్తి కథ ఉంది.

అమెరికా దౌత్య ఇతిహాసంలో కోల్‌కతా నగరానికి అత్యంత ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన ...