భారతదేశం, ఆగస్టు 30 -- Social Media Influencer Manjeet Kaur Murder: సోషల్ మీడియాలో నిత్యం చిరునవ్వులతో కనిపించే ఒక యంగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్యకు గురైంది. రెండు నెలల కిందట జరిగిన ఘోరమైన దాడిలో తీవ్ర గాయాలపాలైన పంజాబ్‌కు చెందిన ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ మంజీత్ కౌర్ (28) మృత్యువుతో పోరాడి ఓడిపోయారు.

చండీగఢ్‌లోని పీజీఐఎమ్‌ఈఆర్‌ (PGIMER) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆగస్టు 26న మంజీత్ కౌర్ కన్నుమూశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. బాధితురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం కథనం ఇలా ఉంది.

జులై 3న చండీగఢ్‌లోని సెక్టార్ 34 మద్యం దుకాణం వద్దకు మంజీత్‌ను ఆమెకు తెలిసిన షుభి, పిందా అనే ఇద్దరు వ్యక్తులు పిలిపించారు. అక్కడ ఆమెను బలవంతంగా కారులో ఎక్కించుకుని పంజాబ్‌లోని రూప్‌నగర్ జిల్లా మోరిండా ప్రాంతానికి తీస...