భారతదేశం, మార్చి 20 -- భారతీయ చలనచిత్ర దిగ్గజం మణిరత్నం తన తదుపరి భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించడానికి సిద్ధమయ్యారు. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో గతేడాది విడుదలైన 'థగ్ లైఫ్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో మణిరత్నం ఒక క్రేజీ కాంబినేషన్‌ను సెట్ చేశారు.

మణిరత్నం కొత్త చిత్రంలో 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, 'నేచురల్ బ్యూటీ' సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. గురువారం (మార్చి 19) మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించాయి. ఈ చిత్రానికి సోనీ మ్యూజిక్ సౌత్ ఆడియో పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.

అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తారనే ప్రచారం జరిగింది. కానీ, ఆ రూమర్లకు చెక్ పెడుతూ...