భారతదేశం, మే 14 -- Mandana Karimi About Leaving India: మోడల్, నటిగా గుర్తింపు తెచ్చుకున్న మందనా కరిమి ఇరాన్ మూలాలున్న వ్యక్తి. గత 16 ఏళ్లుగా భారత్‌లో ఉంటూ ఇక్కడి చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే, ప్రస్తుతం ఇరాన్‌లో నెలకొన్న అత్యంత భయంకరమైన పరిస్థితులు మందనాను తీవ్ర కలతకు గురిచేస్తున్నాయి.

"భారత్‌కు వీడ్కోలు పలుకుతున్నాను.. నా రెండో ఇంటిని విడిచి వెళ్లడం బాధగా ఉన్నా తప్పడం లేదు" అని మందనా కరిమి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తన ఆవేదనను పంచుకున్నారు. ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న దౌత్యపరమైన వైఫల్యాలు, నిత్యం జరుగుతున్న ప్రాణనష్టం ఆమెను ఈ కఠిన నిర్ణయం తీసుకునేలా చేశాయి.

ఇరాన్ ప్రస్తుత పరిస్థితిపై కరిమి అభిమానులు అడిగిన ప్రశ్నలకు స్పందిస్తూ మందనా కన్నీటి పర్యంతమయ్యారు. అక్కడ పరిస్థితి ఏమాత్రం మెరుగుపడలేదని, పైగా మరింత ఉద్...