భారతదేశం, సెప్టెంబర్ 13 -- Manchu Manoj: 2025 సెప్టెంబర్ 12న థియేటర్లలోకి వచ్చిన తేజ సజ్జా, మంచు మనోజ్ ల భారీ చిత్రం 'మిరాయ్' బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఏడాది తర్వాత, 2026 సెప్టెంబర్ 12న అదే తేదీన సైమా (SIIMA) వేదికపై 'ది బ్లాక్ స్వోర్డ్' పాత్రకు గానూ మంచు మనోజ్ బెస్ట్ విలన్ అవార్డును అందుకున్నారు.

సైమా 2026 అవార్డుల్లో మంచు మనోజ్ తెలుగు సినిమాలకు గాను బెస్ట్ విలన్ గా నిలిచారు. అవార్డు గెలుచుకున్న అనంతరం మనోజ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఎమోషనల్ పోస్ట్ ప్రతి ఒక్కరి హృదయాలను తాకుతోంది. తన భార్య మౌనికతో కలిసి దిగిన ఫొటోను మంచు మనోజ్ పోస్టు చేశారు.

"నేను నా భవిష్యత్తును సరిగ్గా ఊహించలేక ఇబ్బందిపడుతున్న సమయంలో మౌనిక నా జీవితంలోకి వచ్చి నన్ను నమ్మింది. 'మిరాయ్' షూటింగ్ జరుగుతున్నప్పుడు ఆమె కడుపులో మన చిన...