భారతదేశం, మార్చి 6 -- మలయాళ వెర్సటైల్ నటుడు ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రలో నటించిన ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'ధీరం' (Dheeram) ఓటీటీ విడుదలపై ప్రస్తుతం సస్పెన్స్ కొనసాగుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈ సినిమా శుక్రవారం (మార్చి 6) 'సన్ నెక్స్ట్' (Sun NXT)లో స్ట్రీమింగ్ కావాల్సి ఉంది. అయితే సాంకేతిక కారణాల వల్ల లేదా మరే ఇతర కారణాల వల్లనో కానీ ఈ సినిమా ఆశించిన సమయానికి అందుబాటులోకి రాలేదు.

నిజానికి ఫిబ్రవరి 6నే ధీరం ఓటీటీలోకి వస్తోందని అనౌన్స్ చేస్తూ వచ్చారు. అయితే ఓటీటీలోకి రావాల్సిన ఈ మూవీ ఇప్పటికే వాయిదా పడుతూ వస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) సొంతం చేసుకుందని, త్వరలోనే అక్కడ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే దీనిపై అటు నిర్మాతలనుండి గా...