భారతదేశం, మార్చి 10 -- మెగా కోడలు, వరుణ్ తేజ్ భార్య, హీరోయిన్ లావణ్య త్రిపాఠి (లావణ్య కొణిదెల)కి ఆన్‌లైన్‌లో వేధింపులు ఎదురయ్యాయి. దీంతో సైబర్ వేధింపులపై లావణ్య గళమెత్తారు. గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా తనను, తన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కావాలనే విష ప్రచారం చేస్తున్నారంటూ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు.

ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి తన వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న ఒక నిర్దిష్ట ఇన్‌స్టాగ్రామ్ ఖాతాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

తన ఫిర్యాదులో లావణ్య పలు కీలక విషయాలను ప్రస్తావించారు. సదరు ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనపై తప్పుడు ఆరోపణలు చేయడమే కాకుండా, తన కుటుంబ సభ్యుల గురించి కూడా అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని లావణ్య ఆవేదన వ్యక్తం చేశార...