భారతదేశం, ఆగస్టు 18 -- భారత ప్రాథమిక మార్కెట్లో మరో ప్రముఖ సంస్థ పబ్లిక్ ఇష్యూతో ముందుకొచ్చింది. లలితా జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ ఐపీఓ ఆగస్టు 17, 2026న ప్రారంభం కాగా.. ఆగస్టు 19 వరకు బిడ్డింగ్‌కు అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఈ ఐపీఓ కోసం ఒక్కో ఈక్విటీ షేరు ధరను రూ. 190 నుంచి రూ. 201గా నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలో లిస్ట్ కానుంది. ప్రస్తుతం గ్రే మార్కెట్‌లో ఈ షేర్లకు మంచి డిమాండ్ కనిపిస్తోంది. మొదటి రోజు ముగిసే సమయానికే ఈ ఇష్యూ 69 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. మరి ఈ లలితా జ్యువెలరీ ఐపీఓ జీఎంపీ ఎంత? ఈ ఐపీఓకి అప్లై చేసుకోవాలా? వద్దా? నిపుణుల సూచనలను ఇక్కడ తెలుసుకోండి..

మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. గ్రే మార్కెట్‌లో లలితా జ్యువెలరీ షేరు రూ. 30 ప్రీమియంతో ట్రేడవుతోంది. అంటే లలితా జ్యువెలరీ ఐపీఓ జీఎంపీ రూ. 30గా ఉంది. ఇది అప్పర...