భారతదేశం, జూన్ 2 -- lalit modi: 2022లో బాలీవుడ్ నటి సుస్మితా సేన్, ఐపీఎల్ మాజీ బాస్ లలిత్ మోదీల ప్రేమాయణం సోషల్ మీడియాను ఎంతగా ఊపేసిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో వీరిద్దరి ఫోటోలు వైరల్ అయినప్పుడు నెటిజన్లు, ముఖ్యంగా కొందరు ట్రోలర్స్ సుస్మితా సేన్‌ను టార్గెట్ చేస్తూ 'గోల్డ్ డిగ్గర్' అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

అయితే, తాజాగా 'హ్యూమన్స్ ఆఫ్ బాంబే' (Humans of Bombay) పాడ్‌కాస్ట్‌లో లలిత్ మోదీ చేసిన వ్యాఖ్యలు ఆ ట్రోల్స్‌కు పరోక్షంగా చెక్ పెట్టడమే కాకుండా, వారి బంధం ముగియడానికి గల అసలు 'లాజిస్టికల్' కారణాన్ని బయటపెట్టాయి.

వారాల తరబడి లలిత్ మోదీ, సుస్మితా సేన్ డేటింగ్ వార్త మీడియాలో మారుమోగింది. అయితే, ఎంత వేగంగా వీరి ప్రేమాయణం తెరపైకి వచ్చిందో, అంతే వేగంగా వీరిద్దరూ విడిపోయారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ బ్రేకప్ వెనుక ఉన్న అసలు కారణాన్ని లలిత్...