KRMB : తాగునీటి అవసరాల కోసం ఆగస్టు 15 వరకు ఏపీ, తెలంగాణకు 31 టీఎంసీలు కేటాయింపు
భారతదేశం, మే 13 -- కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(KRMB)కు చెందిన ముగ్గురు సభ్యుల కమిటీ ఆగస్టు 15 వరకు తాగునీటి అవసరాల కోసం తెలుగు రాష్ట్రాలకు నీటి కేటాంపులు చేసింది. తెలంగాణకు శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల నుండి 21 టీఎంసీలు,, ఆంధ్రప్రదేశ్కు నాగార్జునసాగర్ నుండి 10 టీఎంసీల నీటిని కేటాయించాలని నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంజనీర్-ఇన్-చీఫ్లు కె. నరసింహ మూర్తి, ఓ.వి. రమేష్ బాబు, నదీ బోర్డు సభ్య కార్యదర్శి సతీష్ కంబోజ్లతో కూడిన ఈ కమిటీ, ఉమ్మడి జలాశయాలు రెండింటిలోనూ నీటి లభ్యతను సమీక్షించింది. ఆగస్టు 15 వరకు తాగునీటి అవసరాలను తీర్చడానికి తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం 31 టీఎంసీల నీటిని కేటాయించాలని నిర్ణయించింది.
ఏప్రిల్ 29 నాటి తన లేఖలో ఆంధ్రప్రదేశ్ మే నెలాఖరు వరకు తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుండి 10 టీఎంసీల నీట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.