భారతదేశం, జూలై 23 -- సిద్దిపేట - సికింద్రాబాద్ మార్గంలో ప్రయాణించే రైలు ప్రయాణికులకు, ముఖ్యంగా కొమురవెల్లి మల్లన్న భక్తులకు దక్షిణ మధ్య రైల్వే ఒక తీపి కబురు అందించింది. ఈ మార్గంలో నడుస్తున్న డెమో రైళ్లకు ఈనెల 26వ తేదీ నుంచి కొమురవెల్లి రైల్వే స్టేషన్‌లో అధికారికంగా హాల్టింగ్ (ఆగడానికి) సౌకర్యం కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వచ్చే వేలాది మంది భక్తులకు, స్థానిక వ్యాపారులకు ఈ నిర్ణయం ఎంతో ఊరట నివ్వనుంది. కొమురవెల్లి స్టేషన్‌లో రైళ్లు ఆగే వేళలను దక్షిణ మధ్య రైల్వే క్రింది విధంగా వెల్లడించింది.

రైలు నంబరు 77654 (సిద్దిపేట - సికింద్రాబాద్): సిద్దిపేట నుంచి బయలుదేరే ఈ డెమో రైలు కొమురవెల్లి స్టేషన్‌కు మధ్యాహ్నం 2:38 గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు సేవలు...