భారతదేశం, జూన్ 6 -- Kohli: టీమ్‌ఇండియా క్రికెట్ అభిమానులకు, కోహ్లి ఫ్యాన్స్ కు భారీ షాక్. అఫ్గానిస్థాన్‌తో త్వరలో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నుంచి స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయం కారణంగా తప్పుకున్నాడు. అతని స్థానంలో యువ ఎడమచేతి వాటం ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) శనివారం (జూన్ 6) జట్టులోకి ఎంపిక చేసింది.

మే 31న జరిగిన ఐపీఎల్ 2026 (IPL 2026) ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడిన సంగతి తెలిసిందే. ఈ హై-టెన్షన్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరఫున ఆడుతున్న సమయంలోనే కోహ్లీకి తీవ్రమైన తొడకండరాల గాయం (హ్యామ్‌స్ట్రింగ్) అయింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో 16 మ్యాచ్‌ల్లో 165.85 స్ట్రైక్ రేట్‌తో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో ఏకంగా 675 పరుగులు చేసి టాప్ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. ఈ ద...