భారతదేశం, జూలై 5 -- రాష్ట్ర ప్రజల భద్రత, సాగునీటి ప్రాజెక్టుల రక్షణ విషయంలో తమ ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాలేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీలను పూర్తిగా పునరుద్ధరించి.. జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA), కేంద్ర జల సంఘం (CWC) స్వతంత్రంగా అనుమతులు మంజూరు చేసిన తర్వాతే వాటిని ఆపరేట్ చేస్తామని ఆయన ప్రకటించారు.

నాగార్జునసాగర్ డ్యామ్ సమీపంలోని విజయ్ విహార్‌లో శనివారం సీనియర్ ఇంజనీర్లతో కలిసి నీటిపారుదల పనులపై మంత్రి సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రయోజనాలు, ప్రదర్శనల కంటే భద్రత, స్థిరత్వం, ప్రజా ఆస్తుల రక్షణే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముఖ్యమని తేల్చిచెప్పారు.

"కావాల్సిన ప్రతి ఒక్క మరమ్మతు...