భారతదేశం, జూలై 30 -- Kirti Kulhari Get Lakhs Of Cyber Fraud: దేశంలో సైబర్ నేరాలు రోజురోజుకూ సరికొత్త రూపాలు దాలుస్తూ సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ముప్పుతిప్పలు పెడుతున్నాయి. తాజాగా ప్రముఖ బాలీవుడ్ బోల్డ్ నటి కీర్తి కుల్హారీ సైబర్ క్రిమినల్స్ చేతిలో చిక్కి భారీగా నగదు పోగొట్టుకున్నారు.

కీర్తి కుల్హారీ ప్రమేయం లేకుండానే క్రెడిట్ కార్డ్ వివరాలు చోరీ చేసి రూ.2.44 లక్షల విదేశీ లావాదేవీలు జరిపారు. జూలై 24వ తేదీ రాత్రి వెర్సోవాలోని యారీ రోడ్డులో నివసిస్తున్న 43 ఏళ్ల కీర్తి కుల్హారీ, ముంబై అంధేరి వెస్ట్‌లోని ఒక మల్టీప్లెక్స్‌కు సినిమా చూడటానికి వెళ్లారు.

థియేటర్‌కు చేరుకునే దారిలోనే ఆమె మొబైల్‌కు బ్యాంకు నుంచి ఓ హెచ్చరిక సందేశం వచ్చింది. ఆమె క్రెడిట్ కార్డ్ ఉపయోగించి ఏరోమెక్సికో ఎయిర్‌లైన్స్‌కు 2,525 యూఎస్ డాలర్ల విదేశీ చెల్లింపు జరి...