భారతదేశం, మే 29 -- Kazipet Rail Manufacturing Unit : తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, రవాణా రంగాల అభివృద్ధిలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతం కాబోతోంది. వరంగల్ పరిధిలోని కాజీపేటలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ (RMU) పనులు విజయవంతంగా పూర్తి కావొచ్చాయి.

ఈ బహుళ ప్రయోజన రోలింగ్ స్టాక్ తయారీ కేంద్రాన్ని త్వరలోనే పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చి, సరికొత్త ఇంటర్‌సిటీ రైళ్ల తయారీని ప్రారంభించబోతున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గురువారం ప్రకటించారు. కాజీపేట రైల్వే తయారీ యూనిట్ ప్రగతిపై ఆయన ఉన్నతాధికారులతో కలిసి ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి,.. పనుల పురోగతి పట్ల పూర్తి సంతృప్తిని వ్యక్తం చేశారు.

"తొలి దశలో భాగంగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏకంగా 200 అత్యాధునిక ఇంటర్‌సిటీ రైళ్లను తయారు చ...