భారతదేశం, ఏప్రిల్ 30 -- Telangana Rashtra Sena : తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం చోటుచేసుకుంది. కల్వకుంట్ల కవిత సారథ్యంలో రూపుదిద్దుకున్న నూతన రాజకీయ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం (అధికారికంగా ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పేరును రిజిస్టర్ చేస్తూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంది.

ఈ నెల 25వ తేదీన మేడ్చల్ పరిధిలోని అద్వయ కన్వెన్షన్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కవిత తన కొత్త పార్టీ పేరును ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణ అస్తిత్వాన్ని, ప్రజల ప్రయోజనాలను రక్షించడమే లక్ష్యంగా ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె అప్పట్లో ప్రకటించారు. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారిక అనుమతి లభించడంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు వేగవంతం కానున్నాయి.

బంజారాహిల్స్‌లోని కవిత నివాసానికి చేరుకున్న ఎన్నికల సంఘం అధికారులు, పార్టీ రి...