భారతదేశం, జూన్ 12 -- Karuppu: తమిళ స్టార్ హీరో సూర్య, త్రిష కాంబోలో వచ్చిన లేటెస్ట్ ఫాంటసీ యాక్షన్ డ్రామా 'కరుప్పు' థియేటర్లలో భారీ విజయాన్ని నమోదు చేసింది. విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ దగ్గర రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి, 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రంగా రికార్డు సృష్టించింది.

అయితే ఈ సినిమా వెండితెరపైకి రావడానికి ముందు వెనుక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, వివాదాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ సినిమా విడుదల టైమ్ లో తలెత్తిన సమస్యలపై కోలీవుడ్ సీనియర్ ఫిల్మ్ ఫైనాన్సియర్, డిస్ట్రిబ్యూటర్ తిరుప్పూర్ సుబ్రమణియన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సినిమా హిట్ అవ్వగానే కాలర్ ఎగరేస్తున్న డైరెక్టర్ ఆర్జే బాలాజీ (RJ Balaji) తీరును ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.

ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తిరుప్పూర్ సుబ్రమణియన్ మాట్లాడుతూ.. ...