భారతదేశం, మే 14 -- Karthika Deepam 2 Today Episode: కార్తీక దీపం 2 సీరియల్ లో దీపే అసలైన వారసురాలని పారిజాతానికి తెలుస్తుంది. పారు, జ్యోత్స్న కలిసి దీపపై పగ సాధించాలని అనుకుంటారు. అన్నీతెలిసినా ఏం తెలియనట్లు కార్తీక్, దీప దగ్గర పారు నటిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగిందో కార్తీక దీపం 2 టుడే మే 14 ఎపిసోడ్ లో చూసేయండి.

దక్షిణామూర్తి గురించి కార్తీక్ అడిగితే కాంచన ఫుల్ ఫైర్ అవుతుంది. ఆ మనిషి గురించి తెలుసుకోవద్దని చెప్తుంది. అలాగే కంపెనీ వ్యవహారాలకు దూరంగా ఉండమని కార్తీక్, దీపకు కాంచన చెప్తుంది. తాత పేరు ఎత్తగానే అందరూ సీరియస్ అవుతున్నారు ఎందుకు బావ అని కార్తీక్ ను దీప అడుగుతుంది. తాత ఉన్నాడని తెలిశాక వివరాలు తెలుసుకోకుండా ఎలా అని అడుగుతుంది. దాని గురించి వదిలేద్దామని కార్తీక్ చెప్తాడు.

మరోవైపు దక్షిణామూర్తి గురించి సుమిత్ర ఆలోచిస్తూ ఉంటుంది...