భారతదేశం, మార్చి 25 -- కార్తీక దీపం 2 టుడే మార్చి 25 ఎపిసోడ్ లో.. అమ్మా అంటూ నిద్రలో నుంచి దీప ఉలిక్కిపడి లేస్తుంది. ఏమైందని కార్తీక్ అడుగుతాడు. మా అమ్మను, నాన్నను జ్యోత్స్న చంపేసినట్లు కల వచ్చింది బావ. పదా ఆ ఇంటికి వెళ్దాం. అమ్మకు, నాన్నకు ఏమైనా జరిగితే కాపాడేది మనమే కదా అని దీప అంటుంది.

ఇప్పుడు జ్యోత్స్న నమ్మకం లేని జీవితం బతుకుతుంది. ఇప్పుడు తను ఏం చేయదు. జ్యోత్స్న సుమిత్ర కూతురు కాదనే నిజం తెలిస్తే ఏమైనా చేస్తుందేమో. కానీ మనం లేదా డాక్టర్ హారిక మాత్రమే ఈ నిజం చెప్పాలి. ఈ రెండు జరగనప్పుడు జ్యోత్స్నకు నిజం తెలిసే అవకాశమే లేదు. అన్నీ మర్చిపో. ఇలా హాయిగా పడుకొని ఎన్ని రోజులైందో కదా. పడుకో అని కార్తీక్ చెప్పేసరికి దీప పడుకుంటుంది.

మరోవైపు సుమిత్రకు దశరథ ప్రేమగా తినిపిస్తాడు. ఒక్కోసారి ఇదంతా నిజమేనా? కోమాలో ఉండి కల కంటున్నానా అనిపిస్తుంది...