భారతదేశం, ఏప్రిల్ 30 -- Karisma Kapoor Warning To Photographers: ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో 'ఇండియాస్ బెస్ట్ డ్యాన్సర్' సీజన్ 5 త్వరలో ప్రారంభం కానుంది. ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న 90వ దశకపు స్టార్ హీరోయిన్ కరిష్మా కపూర్ షూటింగ్ ముగించుకుని బయటకు వస్తుండగా పాపరాజీ (ఫోటోగ్రాఫర్లు) ఆమెను చుట్టుముట్టారు. ఆ సమయంలో కొందరు ఫోటోగ్రాఫర్లు కెమెరాలను ఆమెకు అతి దగ్గరగా తీసుకెళ్లి జూమ్ చేయడాన్ని కరిష్మా గమనించారు.

వెంటనే కరిష్మా కపూర్ స్పందిస్తూ.. "జూమ్ మత్ కర్నా" (ఎక్కువగా జూమ్ చేయకండి) అంటూ చాలా స్పష్టంగా, సున్నితంగా హెచ్చరించారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో బయటకు రాగానే నెట్టింట్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.

సెలబ్రిటీలు కూడా మనుషులేనని, వారి వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రవర్తించడం సరికాదని నెటిజన్లు అభ...