భారతదేశం, మే 1 -- Kareena Kapoor Family Vacation At Pataudi Palace: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, బెబో కరీనా కపూర్ తన కుమారులు తైమూర్, జెహ్‌లతో కలిసి హర్యానాలోని తమ పూర్వీకుల నివాసం 'పటౌడీ ప్యాలెస్‌'లో విహరిస్తున్నారు. మే 1వ తేదీన అక్కడి ప్రశాంతమైన వాతావరణానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులకు గుడ్ మార్నింగ్ చెప్పారు.

హర్యానాలో 10 ఎకరాల విస్తీర్ణంలో, 150 గదులతో విరాజిల్లుతున్న పటౌడీ ప్యాలెస్ ఒక అద్భుత కట్టడం. 1935లో నవాబ్ ఇబ్రహీం అలీ ఖాన్ నిర్మించిన ఈ ప్యాలెస్ ప్రస్తుతం దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ ఆధీనంలో ఉంది. షూటింగ్‌లు, బిజీ షెడ్యూల్స్ నుంచి విరామం దొరికినప్పుడల్లా సైఫ్-కరీనా జంట ఇక్కడికే వచ్చి సేదతీరుతుంటారు.

తాజాగా కరీనా షేర్ చేసిన ఫోటోల్లో పటౌడీ ప్యాలెస్‌లోని పాతకాలపు వరండాలు, తెల్లని స్తంభాలు, క్లాసిక్ ఫర్నీచర్ రాజ...