భారతదేశం, సెప్టెంబర్ 4 -- Kanipakam Brahmotsavam 2026 : చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు శరవేగంగా సాగుతున్నాయి. ఈ మహోత్సవాలకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు అధికారికంగా ఆహ్వానించారు.

ఈ నెల 14వ తేదీ నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు అత్యంత వైభవంగా ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆలయ కమిటీ ప్రతినిధులు ఆహ్వానించారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పూతలపట్టు శాసనసభ్యుడు మురళీ మోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్, కాణిపాకం ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ సురేంద్రబాబు తదితరులు ఉన్నారు.

సచివాలయానికి వచ్చిన ఆలయ ప్రతినిధులకు ముఖ్యమంత్రి సాదర స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కాణిపా...