భారతదేశం, జూలై 28 -- అKangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి సోషల్ మీడియాలో భారీ వివాదానికి తెరలేపారు. నేటితరం పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడిన కొంతమంది హిందూ యువతులను ఉద్దేశించి ఆమె 'జెనరేషన్ గట్టర్' అని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాధ్యత లేకుండా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వేదికగా కంగనా చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

గతంలో కూడా జెన్ జీ (Gen Z) యూత్ ప్రవర్తనపై విమర్శలు గుప్పించిన ఈ నటి.. ఇప్పుడు మరోసారి పాశ్చాత్య పోకడలపై ఓపెన్ నోట్ రాసుకొచ్చారు.

కంగనా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాస్తూ.. స్వతంత్రంగా ఎదిగిన ఉద్యోగినులను అనుకరించాలని చూస్తున్న కొంతమంది యువతుల ప్రవర్తన చాలా అసహ్యకరంగా ఉందన్నారు. స్వేచ్ఛను కష్టపడి సంపాదించుకోకుండా కేవలం హక్కుల గు...