భారతదేశం, మే 9 -- టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి రానున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం 'కల్కి2898 ఏడీ పార్ట్ 2' (Kalki 2). మొదటి భాగం కల్కి 2898 ఏడీ సృష్టించిన సంచలనాల తర్వాత, ఇప్పుడు పార్ట్-2 కోసం యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

తాజా సమాచారం ప్రకారం, ఈ భారీ బడ్జెట్ సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కల్కి 2ని 2027 డిసెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు ప్రముఖ సినీ వర్గాల నుంచి బలమైన లీకులు అందుతున్నాయి.

దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సీక్వెల్ కోసం మొదటి భాగం కంటే రెట్టింపు శ్రమ పడుతున్నారు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి హేమాహేమీలతో పాటు ఈసారి సాయి పల్లవి కూడా కీలక పాత్రలో మెరవనుంది. 2027 ఏప్రిల్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నా...