భారతదేశం, ఆగస్టు 6 -- Kajal Aggarwal: బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారి రూ.4000 కోట్ల భారీ బడ్జెట్‌తో క్రియేట్ చేస్తున్న విజువల్ వండర్ 'రామాయణం' (Ramayana) సినిమాలో లంకేశ్వరుడి భార్య మండోదరి పాత్రలో టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ నటిస్తోంది. ఈ మైండ్ బ్లోయింగ్ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్‌పై తాజాగా స్పందించిన కాజల్.. "రాముడు మన రక్తంలోనే ఉన్నాడు, మన ప్రతి శ్వాసలోనూ ఉన్నాడు" అంటూ చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

భారతీయ సంస్కృతిని, మన పురాణాలను ప్రపంచ వేదికపై గ్లోబల్ ఆడియన్స్‌కు చూపించడానికి ఇది సరైన టైమ్ అని కాజల్ అగర్వాల్ వెల్లడించింది. చిన్నతనం నుంచి మనం విని పెరిగిన శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి కథలను ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయడానికి రామాయణాన్ని మించిన గొప్ప స్టోరీ మరొకటి లేదని స్పష్టం చేసింది.

ప్...