భారతదేశం, ఏప్రిల్ 27 -- Singer Kailash Kher Slams Host: ఏదైనా అవార్డు వేడుక లేదా ఆడియో ఫంక్షన్ జరిగినప్పుడు హోస్ట్‌లు అక్కడికి వచ్చిన సింగర్లను సరదాగా రెండు పాటలు పాడమని అడగడం మనం నిత్యం చూస్తుంటాం. అయితే, ఈ సంప్రదాయంపై ప్రముఖ గాయకుడు కైలాష్ ఖేర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 25న ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్‌లో జరిగిన 'సిక్స్ సిగ్మా లీడర్‌షిప్ సమ్మిట్'లో సింగర్ కైలాష్ ఖేర్ అతిథిగా పాల్గొన్నారు. ఈ క్రమంలో వ్యాఖ్యాత (హోస్ట్) కైలాష్ ఖేర్‌ను 'రెండు లైన్లు పాడి వినిపించమని' కోరారు. దీనికి కైలాష్ ఖేర్ చాలా ఘాటుగా స్పందించారు.

"సంగీతాన్ని, గాయకులను ఇలా చూడకూడదు. 'రెండు లైన్లు పాడండి.. మూడ్ సెట్ చేయండి' అని అడగడం చాలా తప్పు. ఇలాంటి రిక్వెస్ట్‌లు అస్సలు చేయకండి. సమాజంలో ఈ ధోరణిని మార్చాలన్నదే నా తపన" అని ఆయన బహిరంగంగానే తేల్చి చెప్పారు.

కళాకా...