భారతదేశం, మే 28 -- Jr NTR: మహానటుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు 103వ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ప్రతి ఏటా తాతగారిని స్మరిస్తూ పత్రికల్లో ప్రకటన ఇవ్వడం, ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులర్పించడం జూనియర్ ఎన్టీఆర్ కు ఒక ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా అదే రిపీట్ అయింది. ఉదయాన్నే తారక్ ఎన్టీఆర్ ఘాట్‌కు చేరుకుని తన తాతగారికి ఘనంగా అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్దకు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తారక్‌ను చూడగానే అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేసింది. అక్కడ ఒక్కసారిగా "సీఎం ఎన్టీఆర్.. సీఎం సీఎం" అంటూ చేసిన నినాదాలు మిన్నంటాయి. ప్రతి సంవత్సరం ఇలాంటి నినాదాలు రావడం సహజమే అయినప్పటికీ, ఈసారి మాత్రం ఆ సౌండ్ చాలా గట్టిగా వినిపించింది.

నిజానికి ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ కనిపించినా సీఎం అనే నిన...