భారతదేశం, ఆగస్టు 3 -- Jio Home Offers: టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో (Reliance Jio) తెలుగు రాష్ట్రాల ప్రజలకు మైండ్ బ్లాకింగ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న కుటుంబాల కోసం హై-స్పీడ్ వైఫై, 1,000కి పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, పాపులర్ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లతో కూడిన 'జియో హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్స్‌'ను కేవలం నెలకు రూ. 400ల ప్రారంభ ధరకే అందుబాటులోకి తెచ్చింది. ఒకే ఒక్క కనెక్షన్, ఒకే నెలవారీ బిల్లుతో ఇంటర్నెట్, టీవీ, ఓటీటీ సేవలను సొంతం చేసుకునే వెసులుబాటును ఈ ఆల్-ఇన్-వన్ ప్యాకేజీ కల్పిస్తోంది.

సాధారణంగా వర్షం పడినా, తుఫాను వచ్చినా కేబుల్ టీవీ లేదా DTH సిగ్నల్స్ కట్ అయి ఇబ్బంది పెడుతుంటాయి. అయితే జియో తన సొంత ఫైబర్ నెట్‌వర్క్ ద్వారా టీవీ సేవలను అందిస్తుండటంతో వాతావరణం బాగా లేకపోయినా కూడా ఎలాంటి అంతరాయం లేని క్వాలిటీ వ్యూ...