భారతదేశం, మార్చి 25 -- మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎపిసోడ్ కు ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్ గా ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆయన. రాజీనామా లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీలో జరిగిన అవమానాలను ప్రస్తావించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలతో ఆయన సొంత పార్లమెంట్ మహబూబ్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని జీవన్ రెడ్డి గుర్తు చేశారు. చేవెళ్ల ఎంపీ స్థానానికి తొలుత సునీతా మహేందర్ రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించి.. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుండి రంజిత్ రెడ్డిని తెచ్చి అతనికి ఇచ్చారని విమర్శించారు. దాని ప్రభావం మహబూబ్ నగర్ అలానే చేవెళ్ల, సికింద్రాబాద్ సీట్లుపై పడిందన్నారు.

"తనకు ఎవడైనా అడ్డం వస్తే తొక్కుతా అని రేవంత్ రెడ్డి ...