భారతదేశం, మార్చి 31 -- ఆస్తి పన్ను చెల్లించనందుకు దివంగత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్‌లోని ఇంటిని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) సీజ్ చేసింది. యూసుఫ్‌గూడలో ఉన్న ఈ ఇంటికి చాలా సంవత్సరాలుగా బకాయిలు చెల్లించకపోవడంతో సీల్ వేసినట్లు అధికారులు తెలిపారు. జయలలితకు యూసుఫ్‌గూడ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-38 పరిధి శ్రీనగర్‌కాలనీలో జీ ప్లస్ 4తో భవనం ఉంది. జయలలిత పేరుతో ఇంటి నంబరు 8-3-1099/ఎ (పీటీఐఎన్‌ నంబరు.1100833474)గా రిజిస్ట్రేషన్ అయి ఉన్నది.

ఆస్తి పన్నుకు సంబంధించి మొత్తం బకాయిలు రూ.83 లక్షలుగా ఉన్నాయి. ఆస్తి యజమానులకు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ, 2017 నుంచి ఆస్తి పన్ను చెల్లించలేదని అధికారులు తెలిపారు. పదేపదే పంపిన రిమైండర్లకు స్పందన లేకపోవడంతో బకాయిలను వసూలు చేయడానికి జీహెచ్‌ఎంసీ మున్సిపల్ చట్ట...