భారతదేశం, జూలై 20 -- లోపల రోగి లేగి లేని ఒక అంబులెన్స్​ని జంతర్​ మంతర్​ వద్దకు పంపించారని, దాని వల్ల తీవ్ర గందరగోళం నెలకొనే ప్రమాదం ఉందని సీజేపీ ఆరోపించింది.

"ఎమర్జెన్సీ పరిస్థితులు లేని, లోపల అసలు రోగి కూడా లేని అంబులెన్స్​ని జంతర్​ మంతర్​ వద్దకు పంపించారు. దాని వల్ల తృటిలో తొక్కిసలాట జరిగేది. జంతర్ మంతర్ వద్ద గందరగోళం సృష్టించేందుకు ప్రభుత్వం ఇంతకు తెగిస్తుందా? శాంతియుత నిరసనకారులంటే ఎందుకు అంత భయం?" అని సీజేపీ తన ఎక్స్​లో పోస్ట్ చేసింది.

దిల్లీలో తాజా పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ స్పందించారు. శాంతియుతంగా జరుగుతున్న పార్లమెంట్​ మార్చ్​లో లాఠీలను ఉపయోగించాల్సిన అవసరం ఏముంది? అని ప్రశ్నించారు.

సోనమ్ వాంగ్ చుక్ సోమవారం సఫ్దర్ జంగ్ ఆసుపత్రిని తాత్కాలికంగా విడిచిపెట్టడానికి అనుమతించాలని కోరారు. తద్వారా తాను పార్లమెంట్ వైపు '...