భారతదేశం, ఏప్రిల్ 11 -- కోలీవుడ్ స్టార్ హీరో, దళపతి విజయ్ ఆఖరి చిత్రం 'జన నాయగన్'. ఈ సినిమా కోసం కోట్లాది మంది అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే, థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనూహ్యంగా పైరసీ వెబ్‌సైట్లలో ప్రత్యక్షం కావడం ఇప్పుడు చిత్ర పరిశ్రమను కుదిపేస్తోంది. జన నాయగన్ లీక్ పై హీరోయిన్ పూజా హెగ్డే ఎమోషనల్ అయింది.

సెన్సార్ వివాదంతో జన నాయగన్ రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన హెచ్‌డీ ప్రింట్లు ఆన్‌లైన్‌లో లీక్ కావడంతో తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటులు ఈ చర్యను తీవ్రంగా ఖండించారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే ఈ ఘటనపై తన ఆవేదనను, నిరాశను వ్యక్తం చేసింది.

శనివారం (ఏప్రిల్ 11) తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పూజా హెగ్డే స్పందిస్తూ ఒక ఎమోషనల్ నోట్ పంచుకు...