భారతదేశం, మే 5 -- Jagapathi Babu: విభిన్నమైన క్యారెక్టర్లు చేస్తూ, విలక్షణమైన నటనతో జగపతి బాబు అదరగొడుతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోలా దూసుకెళ్లిన ఆయన.. ఇప్పుడు విలన్ సహా ఇతర క్యారెక్టర్లు చేస్తూ ఫ్యాన్స్ ను ఎంటర్ టైన్ చేస్తున్నారు. తాజాగా జగపతి బాబు సోషల్ మీడియా పోస్టు వైరల్ గా మారింది. ఒక్కడు.. అంటూ ఆయన ఫొటో పంచుకున్నారు.

జగపతి బాబు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు సమాచారం. అక్కడి నుంచే జగ్గూ భాయ్ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఏదో మెట్రో స్టేషన్ లో జగపతి ఆ ఫోటో తీసుకున్నట్లు ఉంది.

''ఒక్కడు.. నేను ఒక్కడినే ట్రైన్ ఎక్కి హోటల్ కు వెళ్లిపోతున్నాను. ఎక్కడికి వెళ్తానే ఏమిటో.. అసలే దారి తెలియదు'' అని జగపతి బాబు ఫన్నీ క్యాప్షన్ ఇచ్చారు.

జగపతి బాబు పోస్టు వైరల్ గా మారింది. నెటిజన్లు ఫన్నీ కామెంట్లతో సరదాగా రియాక్టవుతున్నారు. 'ట్రైన్ కి ...