భారతదేశం, మార్చి 20 -- ఐఆర్‌సీటీసీ టూరిజం పలు ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తోంది. విజయవాడ నుంచి తమిళనాడులోని ప్రముఖ ఆలయాలను సందర్శించి రావొచ్చు. ఆరు రోజులు, ఐదు రాత్రుల టూర్ ప్యాకేజీ ఇది. విజయవాడ నుంచి మెుదలై.. తంజావూరు, రామేశ్వరం, మధురై, కొడైకెనాల్‌లాంటి ప్రాంతాలను చూడొచ్చు. 25 ఏప్రిల్ 2026న టూర్ మెుదలవుతుంది.

మధ్యాహ్నం విజయవాడ విమానాశ్రయం నుండి బయలుదేరాలి. సాయంత్రానికి తిరుచ్చి విమానాశ్రయం చేరుకోవాలి. సాయంత్రం శ్రీరంగం ఆలయాన్ని సందర్శించాలి. రాత్రి భోజనం తర్వాత తిరుచ్చిలోనే బస ఉంటుంది.

హోటల్‌లో అల్పాహారం చేయాలి. చెక్-అవుట్ చేసి తంజావూరుకు (60 కి.మీ) బయలుదేరాలి. బృహదీశ్వర ఆలయాన్ని సందర్శించాలి. మధ్యాహ్నం రామేశ్వరానికి (240 కి.మీ) బయలుదేరాలి. హోటల్‌లో చెక్-ఇన్ చేసి రాత్రి భోజనం చేసి, బస రామేశ్వరంలో ఉంటుంది.

హోటల్‌లో అల్పాహారం చ...