భారతదేశం, ఫిబ్రవరి 27 -- షిర్డీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.? హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలోనే టూర్ ప్యాకేజీ వచ్చేసింది. మూడు రోజుల పాటు టూర్ ఉంటుంది. ట్రైన్ జర్నీ ద్వారా ఆపరేట్ చేస్తారు. ఐఆర్సీటీసీ టూరిజం తీసుకువచ్చిన ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా. షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించుకోవచ్చు.

ఈ టూర్ ప్యాకేజీని "సాయి సన్నిధి EX హైదరాబాద్ "పేరుతో ఆపరేట్ చేస్తున్నారు. ఐఆర్సీటీసీ టూరిజం వెబ్ సైట్ లో ఈ ప్యాకేజీని బుకింగ్ చేసుకోవాలి. జర్నీ డేట్ కంటే ముందే టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్యాకేజీ మార్చి 4వ తేదీన అందుబాటులో ఉంది.

2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.ఆసక్తి గల టూరిస్టులు https://www.irctctourism.com/ వెబ్ సైట్ ద్వారా టికెట్లను బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. కామారెడ్డి, నిజామాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో కూడా ట్రైన్ ఎక...