భారతదేశం, జూన్ 4 -- ఎండల తీవ్రతతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు సరికొత్త ఊరట లభించనుంది. వేసవి సెలవులు ముగుస్తున్న తరుణంలో, చల్లని కొండల మధ్య సేదతీరాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) అద్భుతమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'అల్టిమేట్ ఊటీ ఎక్స్ హైదరాబాద్ (ULTIMATE OOTY EX HYDERABAD - SHR094 పేరుతో సాగే ఈ స్పెషల్ టూర్ ప్యాకేజీ 2026 జూన్ 9వ తేదీన ఉంది. తెలంగాణ నుంచి మాత్రమే కాదు.. ఏపీ నుంచి వెళ్లాలనుకునేవారు కూడా ఈ టూర్ బుక్ చేసుకోవచ్చు.

ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్ల పాటు సాగుతుంది. గుంటూరు జంక్షన్, హైదరాబాద్, నల్గొండ, సికింద్రాబాద్, తెనాలి జంక్షన్ల నుంచి టూర్ ఉంది. రైలు ప్రయాణం, హోటల్ వసతి, ఉదయం అల్పాహారం, స్థానిక సందర్శన అన్నీ ఈ ప్యాకేజీలోనే కవర్ అవుతాయి.

మధ్యాహ్నం 02:20 గంటలకు సిక...