భారతదేశం, జూన్ 6 -- వేసవి కాలం ముగుస్తున్న తరుణంలో అందమైన కేరళ ప్రకృతి దృశ్యాలను, హిల్ స్టేషన్లను చూడాలనుకునే పర్యాటకుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒక అద్భుతమైన ప్యాకేజీని ప్రకటించింది. "KERALA HILLS & WATERS" పేరుతో అందిస్తున్న ఈ ప్రత్యేక టూర్ ప్యాకేజీ జూన్ 16, 2026న ప్రారంభం కానుంది.

5 రాత్రులు, 6 పగళ్ల పాటు సాగే ఈ టూర్ ద్వారా కేరళలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలైన మూన్నార్, అలెప్పీ సందర్శించవచ్చు. సికింద్రాబాద్, హైదరాబాద్, నల్గొండ, గుంటూరు జంక్షన్, తెనాలిలో రైలు ఎక్కవచ్చు.

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మధ్యాహ్నం 2.25కి శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రంతా జర్నీ చేయాలి.

రెండో రోజు మొత్తం ఉదయం 11.30కి అలువా రైల్వే స్టేషన్ చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అవూతారు. మూన్నార్ కొన్ని ప్రదేశాలను చూస్తారు. రా...