భారతదేశం, ఏప్రిల్ 17 -- ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను అప్పగించేందుకు సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని, అదే జరిగితే అంతర్జాతీయ చమురు మార్కెట్‌తో పాటు పశ్చిమాసియాలో పెను మార్పులు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

వైట్​హౌస్‌లో విలేకరులతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుందని వెల్లడించారు. ఇరాన్ తన వద్ద ఉన్న సుసంపన్నమైన యురేనియం నిల్వలను అప్పగించేందుకు అంగీకరించిందని ఆయన పేర్కొన్నారు. ఈ నిల్వలను ట్రంప్ తనదైన శైలిలో "న్యూక్లియర్ డస్ట్" (అణు ధూళి) అని సంబోధించడం విశేషం. అణు ఆయుధాల తయారీకి ఈ యురేనియం వాడే ప్రమాదం ఉందని అమెరికా ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది.

"మేము ఒక చారిత్రాత్మక ఒప్పందానికి ...