భారతదేశం, ఏప్రిల్ 3 -- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. గురువారం (ఏప్రిల్ 2) రాత్రి జరిగిన మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 65 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలిచింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి ఆల్ రౌండ్ ప్రదర్శనతో చెలరేగాడు. ఐపీఎల్ 2026లో టీమ్ కు ఫస్ట్ విక్టరీని అందించాడు.

విధ్వంసకర బ్యాటర్లతో నిండి ఉన్న సన్‌రైజర్స్ హైదరాబాద్ రెచ్చిపోయింది. కేకేఆర్ పై పిడుగులా పడింది. ట్రావిస్ హెడ్ (46), అభిషేక్ శర్మ (48), క్లాసెన్ (52), నితీశ్ కుమార్ రెడ్డి (39) పరుగులు చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 226 పరుగులు చేసింది.

సన్‌రైజర్స్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ మ్యాచ్ లో చెలరేగి ఆడారు. పవర్ ప్లేలో దూకుడు ప్రదర్శించారు. దీంతో టీమ్ 6 ఓవర్లలోనే 84 పరుగులు సాధించారు. ...