భారతదేశం, సెప్టెంబర్ 18 -- ప్రపంచవ్యాప్తంగా టెక్ ప్రియులను విశేషంగా ఆకట్టుకునే యాపిల్ కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్​ఫోన్లు భారతీయ మార్కెట్లోకి అడుగుపెట్టాయి. యాపిల్ సంస్థకు చెందిన ఐఫోన్ 18 ప్రో, ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ మోడళ్ల అధికారిక విక్రయాలు సెప్టెంబర్ 18 శుక్రవారం దేశవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. కొత్త ఐఫోన్‌ను అందరికంటే ముందే చేతిలో పట్టుకోవాలనే ఉత్సాహంతో యాపిల్ అభిమానులు స్టోర్ల ముందుకు పోటెత్తారు.

ముంబై బీకేసీ, దిల్లీ-ఎన్‌సీఆర్ (నోయిడా), బెంగళూరులోని యాపిల్ అధికారిక స్టోర్లతో పాటు ప్రముఖ రీసెల్లర్ అవుట్‌లెట్ల వద్ద ఉదయం నుంచే భారీ క్యూలైన్లు కనిపించాయి. పంజాబ్, నాసిక్ వంటి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన కస్టమర్లు గంటల తరబడి క్యూలో నిలబడి తమ డ్రీమ్ ఫోన్‌ను సొంతం చేసుకున్నారు.

నాసిక్ నుంచి ముంబై వచ్చిన హితేష్ పటేల్ అనే కస్టమర్ గురు...