భారతదేశం, ఆగస్టు 11 -- ప్రయాణ రంగంలో ఒక కీలక అధ్యాయానికి తెరలేపింది భారతీయ రైల్వే! టికెట్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను దూరం చేయడానికి రైల్వే శాఖ సరికొత్త ప్రయాణికుల రిజర్వేషన్ సిస్టమ్‌కు (పీఆర్‌ఎస్‌) మారుతోంది. 2010 నుంచి అమల్లో ఉన్న పాత టెక్నాలజీ స్థానంలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన కొత్త వ్యవస్థను దశలవారీగా ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా తత్కాల్ సమయంలో సర్వర్ డౌన్ అవ్వడం, బుకింగ్ స్లో అవ్వడం వంటి సమస్యలకు ఈ కొత్త సిస్టమ్ చక్కటి పరిష్కారం చూపనుంది.

"కొత్త యూజర్ ఫ్రెండ్లీ లుక్ అండ్ ఫీల్‌కు సంబంధించి ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నాము. పాత పీఆర్‌ఎస్ నుంచి కొత్తదానికి మళ్లే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతరం పరీక్షలు నిర్వహిస్తున్నాము." అని రైల్వే బోర్డు పబ్లిక్ రిలేషన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ ధర్మేంద్ర తివారీ తెలిప...