భారతదేశం, మార్చి 1 -- టీ20 వరల్డ్ కప్ చివరి సూపర్ 8 మ్యాచ్ లో వెస్టిండీస్ ను 5 వికెట్లతో చిత్తు చేసింది టీమిండియా. సంజూ శాంసన్ సూపర్ ఇన్నింగ్స్ తో ఈ మెగా టోర్నీలో ఇండియన్ టీమ్ తన అత్యధిక టార్గెట్ చేజ్ చేసింది. అంతేకాదు చేజింగ్ లో అత్యధిక స్కోరు చేసిన ఇండియన్ క్రికెటర్ గా విరాట్ కోహ్లి రికార్డును కూడా శాంసన్ బ్రేక్ చేశాడు. అతడు చివరికి 50 బంతుల్లో 97 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. మార్చి 5న ముంబైలో ఇంగ్లండ్ తో సెమీఫైనల్లో టీమిండియా తలపడనుంది. టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ చేరడం ఇది ఆరోసారి.

సంజూ శాంసన్ కళ్లు చెదిరే ఇన్నింగ్స్ తో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేరింది టీమిండియా. వెస్టిండీస్ తో జరిగిన సూపర్ 8 మ్యాచ్ లో 196 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి మరో 4 బంతులు మిగిలి ఉండగానే చేజ్ చేసింది. చివరి ఓవర్లో 7 పరుగులు అవసరం కాగా.. తొలి బంతికే శ...