భారతదేశం, ఫిబ్రవరి 15 -- చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో మ్యాచ్ లో బ్యాటింగ్ లో ఇండియా మంచి ఆరంభాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయింది. ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 77) ఒక్కడే అదరగొట్టాడు. దీంతో ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది.

ఆదివారం (ఫిబ్రవరి 15) కొలంబోలోని ఆర్. ప్రేమదాస స్టేడియంలో పాకిస్థాన్ తో మ్యాచ్ లో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ కు ఫస్ట్ ఓవర్లోనే షాక్ తగిలింది. డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ (0) డకౌటయ్యాడు. వరుసగా అతను ఆడిన రెండో మ్యాచ్ లోనూ సున్నాకే పెవిలియన్ చేరిపోయాడు. స్పిన్ తో అభిషేక్ కు బ్రేక్ వేద్దామని పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా స్వయంగా బౌలింగ్ చేసి వికెట్ సాధించాడు.

అభిషేక్ శర్మ వికెట్ పడగొట్టిన ఆనందం పాకిస్థాన్ కు ఎక్కువ సేపు ఉంచకుండా ఇషాన్ కిషన్ బ్యాటింగ్ త...