భారతదేశం, మార్చి 5 -- టీమిండియాను ఒంటిచేత్తో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్ చేర్చిన సంజూ శాంసన్ తన ఫామ్ కొనసాగిస్తూ ఇంగ్లండ్ బౌలర్లను కూడా చితకబాదాడు. అతడు కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్స్ లతో 89 రన్స్ చేయడంతో ఇండియా 20 ఓవర్లలో 7 వికెట్లకు 253 రన్స్ చేసింది.

టీ20 వరల్డ్ కప్ రెండో సెమీఫైనల్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే అది ఎంత తప్పుడు నిర్ణయమో సంజూ శాంసన్ త్వరలోనే చూపించాడు. ఆ టీమ్ బౌలర్లను ఊచకోత కోస్తూ తన చివరి సూపర్ 8 మ్యాచ్ ఫామ్ ను కొనసాగించాడు.

అభిషేక్ శర్మ (9) మరోసారి నిరాశ పరిచినా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39)తో కలిసి రెండో వికెట్ కు 97 రన్స్ జోడించి టీమిండియా కళ్లు చెదిరే స్టార్ట్ ఇచ్చాడు సంజూ శాంసన్. ఈ క్రమంలో వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేశాడు. గత మ్యాచ్ లో 97 రన్స్ దగ్గర ఆగి తృటిలో సెంచరీ మిస్సయిన అతడు...