భారతదేశం, జూన్ 28 -- భారతదేశవ్యాప్తంగా వాతావరణ పరిస్థితుల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తుండగా.. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో ఎండ తీవ్రత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 22 రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదిలిపోతున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో ఐదు రోజుల పాటు వానలు కురవనున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో సోమవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురవనున్నాయి. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించనుంద...